BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 07:02 PM
26 వీక్షణలు

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

నాలుగు దశల్లో వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

ఈ జాబ్ క్యాలెండర్‌లో భాగంగా గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

అలాగే పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా జాబ్ క్యాలెండర్‌తో వేలాది మంది అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.