BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​అమృత్ 2.0 పనులను వేగవంతం చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jun, 2026 - 07:33 PM
267 వీక్షణలు

​నాణ్యతా ప్రమాణాలతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం 

బెల్లంపల్లిలో పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎమ్మెల్యే గడ్డం వినోద్

ఇంటింటికి నిరంతరం సురక్షితమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్‌తో కలిసి బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న అమృత్ 2.0 పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా, నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. పనుల కారణంగా స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

​ఈ పరిశీలనలో భాగంగా ప్రజారోగ్య శాఖ ఈఈ, డీఈఈలతో అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి పనుల పురోగతిని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని సమకూర్చుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో ఎక్కడా రాజీ పడవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, ప్రజారోగ్య శాఖ మరియు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు