ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
• ఉపాధి కల్పనతో పేద, మధ్య తరగతి మహిళలు, స్కాలర్ షిప్ లతో విద్యార్థులకు ఒయాసిస్ సంస్థ భరోసా ఇస్తోంది
• విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, మహిళలకు కుట్టుమిషన్లు అందచేసిన ప్రత్తిపాటి
పేద, మధ్య తరగతి విద్యార్థుల విద్యాభ్యాసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న ఒయాసిస్ స్వచ్ఛంద సంస్థ కృషి, సేవల్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
గురువారం పట్టణంలోని కందిమళ్ల జయమ్మ ఆసుపత్రిలో ఒయాసిస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి.. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, మహిళలకు కుట్టు మిషన్లు అందచేశారు. పది, ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ చూపిన 25 మంది ప్రభుత్వ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించారు. 7 గురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు.
విద్యార్థులు, మహిళలకు అండగా నిలుస్తూ, వారి జీవితాలను మెరుగుపరుస్తున్న ఒయాసిస్ సంస్థ సేవలు నిజంగా వెలకట్టలేనివని ప్రత్తిపాటి తెలిపారు. తనకు తెలిసిన దాతల్ని సంప్రదిస్తూ, వారు అందించే ఆర్థిక సాయంతో విద్యాదానం చేస్తున్న వైద్యరాలు శ్రీమతి జయమ్మ సేవల్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించాలన్నారు. ఉపాధి లేక కుటుంబపోషణ భారమై ఏంచేయాలో తెలియని ఎందరో మహిళల జీవితాలకు ఒయాసిస్ సంస్థ కొండంత భరోసా ఇచ్చిందన్నారు.
కార్యక్రమంలో మజీ మర్కెట్ యార్డు చైర్మన్ తేళ్ల సుబ్బారావు, కారుమంచి శివరావు, ఒయాసిస్ సభ్యులు కరణం విజయ, మరేళ్ల ఇందిరా, ప్రఫుళ్ళ దేవి, పాములపాటి శివకుమారి, తదితరులు పాల్గొన్నారు.