BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
11 Jun, 2026 - 04:59 PM
38 వీక్షణలు

• ఉపాధి కల్పనతో పేద, మధ్య తరగతి మహిళలు, స్కాలర్ షిప్ లతో విద్యార్థులకు ఒయాసిస్ సంస్థ భరోసా ఇస్తోంది

• విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, మహిళలకు కుట్టుమిషన్లు అందచేసిన ప్రత్తిపాటి

పేద, మధ్య తరగతి విద్యార్థుల విద్యాభ్యాసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న ఒయాసిస్ స్వచ్ఛంద సంస్థ కృషి, సేవల్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని శాసనసభ్యులు  ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. 

గురువారం పట్టణంలోని కందిమళ్ల జయమ్మ ఆసుపత్రిలో ఒయాసిస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి.. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, మహిళలకు కుట్టు మిషన్లు అందచేశారు. పది, ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ చూపిన 25 మంది  ప్రభుత్వ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించారు. 7 గురు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు.

విద్యార్థులు, మహిళలకు అండగా నిలుస్తూ, వారి జీవితాలను మెరుగుపరుస్తున్న ఒయాసిస్ సంస్థ సేవలు నిజంగా వెలకట్టలేనివని ప్రత్తిపాటి తెలిపారు. తనకు తెలిసిన దాతల్ని సంప్రదిస్తూ, వారు అందించే ఆర్థిక సాయంతో విద్యాదానం చేస్తున్న వైద్యరాలు శ్రీమతి జయమ్మ సేవల్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించాలన్నారు. ఉపాధి లేక కుటుంబపోషణ భారమై ఏంచేయాలో తెలియని ఎందరో మహిళల జీవితాలకు ఒయాసిస్ సంస్థ కొండంత భరోసా ఇచ్చిందన్నారు.

కార్యక్రమంలో మజీ మర్కెట్ యార్డు చైర్మన్ తేళ్ల సుబ్బారావు, కారుమంచి శివరావు, ఒయాసిస్ సభ్యులు కరణం విజయ, మరేళ్ల ఇందిరా, ప్రఫుళ్ళ దేవి, పాములపాటి శివకుమారి, తదితరులు పాల్గొన్నారు.