www.ntodaynews.com
తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
నాదెండ్ల : నాదెండ్ల తహశీల్దార్ గా పనిచేస్తున్న వైవిబి కుటుంబ రావు బదిలీ అయ్యారు. డిప్యూటేషన్ రద్దు కావడంతో ఆయన పూర్వ స్థానమైన గురజాల మండలానికి కుటుంబరావు వెళ్ళాల్సి ఉంది. దీంతో ఆయన గురువారం సాయంత్రం విధుల నుండి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, విఆర్వోలు కుటుంబ రావు కు ఘన వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా మృదు స్వభావిగా పేరున్న కుటుంబ రావు అందరినీ కలుపుకుపోయి పనిచేశారు. మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా, కుటుంబ రావు స్థానంలో ఆయనకు ముందు నాదెండ్ల తహశీల్దార్ గా పనిచేసిన ఎస్. చంద్ర శేఖర్ రేపు నాదెండ్ల తహశీల్దార్ గా విధులలో చేరనున్నారు.