ఘనంగా కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు కాంగ్రెస్ నేతల నివాళులు
ఘనంగా కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు కాంగ్రెస్ నేతల నివాళులు
మంచిర్యాల: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేటర్ పూదరి తిరుపతి, మంచిర్యాల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ హాజరై అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలను, వారి అచంచలమైన ధైర్యసాహసాలను జాతి ఎన్నటికీ మరువదని కొనియాడారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు