www.ntodaynews.com
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నాయకుల చేరిక
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నాయకుల చేరిక
దండేపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మండలం పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరు గులాబీ గూటికి చేరారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో లింగాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ నారాయణ నాయక్ తో పాటు కాంగ్రెస్ నాయకులు దశరథ్ నాయక్, తీగల చంద్రయ్య, ఎండీ జలీల్ ఖాన్, దండుగుల గంగరాజు తదితరులు ఉన్నారు. వీరికి మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు