www.ntodaynews.com
యోగాతో విద్యార్థుల్లో విశ్వాసం, ఏకాగ్రత
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
యోగాతో విద్యార్థుల్లో విశ్వాసం, ఏకాగ్రత
యోగా, ధ్యానంతోనే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు తెలిపారు. ఆదివారం కురుమట్ల గ్రామంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా పద్మ సాధన, త్రీ స్టేజ్ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, భస్త్రిక మరియు ధ్యానం చేయించారు. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అందించిన 'సుదర్శన క్రియ ద్వారా మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ రోజుకు 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రసాద్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.