BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 10 September 2026, 12:20 am
Posted by : DAVU RAVINDER REDDY

అయ్యో పాపం.. మృతదేహాలు దొరక్క బొమ్మలకు అంత్యక్రియలు

అంతర్జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
10 Sep, 2026 - 12:20 AM
5 వీక్షణలు

నేపాల్ విపత్తులో విషాదం.. వారం దాటినా ఆచూకీ లభించని కుటుంబ సభ్యులు

కాఠ్మాండు | Ntoday News

నేపాల్‌లో సంభవించిన విపత్తు పలువురు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వారం రోజులు దాటినా మృతదేహాలు లభించకపోవడంతో, కొందరు బంధువులు గడ్డితో బొమ్మలను తయారు చేసి వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న హృదయవిదారక ఘటనలు కనిపిస్తున్నాయి.

త్రిశూలి నది పరివాహక ప్రాంతంతో పాటు కాఠ్మాండూలోని పశుపతి ఆర్యఘాట్ వద్ద ఇలాంటి విషాద దృశ్యాలు కనిపిస్తున్నట్లు సమాచారం. వరదలు, కొండచరియలు తదితర కారణాలతో గల్లంతైన తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు లభించకపోవడంతో.. వారి ఆత్మలకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో సంప్రదాయ పద్ధతిలో గడ్డితో బొమ్మలు తయారు చేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని బంధువులు కన్నీటిపర్యంతమవుతూ చెబుతున్నారు.

తమ వారిని చివరిసారిగా చూసుకోలేకపోయినా, కనీసం ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపత్తు కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయి, మృతదేహాలు కూడా లభించని పరిస్థితి ఎంతటి విషాదకరమో ఈ ఘటనలు కళ్లకు కడుతున్నాయి.

ఈ హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు” అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.