BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 04:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అబుదాబీలో సంచలనం.. మేనకోడలికి రూ.3.85 కోట్ల తెల్లడేగ బహుమతి!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 04:01 PM
27 వీక్షణలు

అబుదాబీ: మేనకోడలిపై ఉన్న అభిమానంతో ఓ అరబ్ వ్యక్తి ఏకంగా రూ.3.85 కోట్లు విలువ చేసే అరుదైన తెల్లడేగను బహుమతిగా అందించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అబుదాబీలో జరిగిన అంతర్జాతీయ వేట, గుర్రపు స్వారీ ప్రదర్శనలో ఈ ఖరీదైన డేగను వేలం వేశారు.

అబుదాబీలో ఇటీవల నిర్వహించిన **‘అబుదాబీ ఇంటర్‌నేషనల్ హంటింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్–2026’**లో అమెరికాకు చెందిన ‘మార్క్ మోగ్లిచ్ ఫాల్కన్ ఫామ్’ అరుదైన తెల్లడేగను వేలానికి ఉంచింది. **‘ప్యూర్ వైట్ గైర్ గర్మోషా’**గా పేర్కొన్న ఈ డేగను దక్కించుకునేందుకు పలువురు సంపన్నులు పోటీ పడ్డారు.

సుమారు 1.5 కిలోల బరువు, 16.5 అంగుళాల పొడవు ఉన్న ఈ తెల్లడేగకు వేలంలో భారీ ధర పలికింది. షైకా అల్ మన్సూరీ అనే యువతి తన మేనమామతో కలిసి వేలంలో పాల్గొని, స్వయంగా వేలం పాటలో బిడ్‌ చేస్తూ చివరకు 1.5 మిలియన్ దిర్హామ్‌లకు డేగను సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.3.85 కోట్లు.

డేగలపై తనకు ఆసక్తి ఎలా ఏర్పడిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తన మేనమామ వల్లే డేగలపై మక్కువ పెరిగిందని మన్సూరీ వెల్లడించినట్లు సమాచారం.

వేలం పాటలో మన్సూరీ పాల్గొన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఒక డేగకు ఇంత భారీ ధరా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.