BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒంటరిగా నది శుభ్రం చేసిన యువకుడికి అదిరిపోయే జాబ్ ఆఫర్!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 04:12 PM
23 వీక్షణలు

మధ్యప్రదేశ్‌: ఒంటరిగా నది శుభ్రం చేసిన యువకుడి కృషికి అంతర్జాతీయ గుర్తింపు

మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బిట్టూ తబాహి పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన అజ్నార్ నదిని స్వచ్ఛంగా మార్చేందుకు ఆయన ఒంటరిగా శ్రమించడం ప్రారంభించారు.

నది పరిస్థితిని చూసి చలించిపోయిన బిట్టూ ఎవరూ ముందుకు రాకపోయినా వెనక్కి తగ్గకుండా స్వయంగా శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన కృషి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు స్నేహితులు కూడా ముందుకొచ్చి చేతులు కలిపారు. దీంతో కొన్ని నెలల పాటు కొనసాగిన శ్రమతో నదిని శుభ్రం చేయగలిగారు.

బిట్టూ అంకితభావానికి నెదర్లాండ్స్‌కు చెందిన ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సీఈఓ బోయన్ స్లాట్ ముగ్ధుడయ్యారు. ఆయన బిట్టూతో కలిసి పనిచేయాలంటూ ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించినట్లు సమాచారం.

ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన బిట్టూ సేవా కార్యక్రమం అంతర్జాతీయ సంస్థ దృష్టిని ఆకర్షించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక్క వ్యక్తి కూడా మార్పుకు నాంది పలకగలడని బిట్టూ నిరూపించారు.