మోడీ ప్రపంచ స్ఫూర్తిదాయక నేతల్లో ఒకరు: బెల్జియం ప్రధాని బార్ట్ డెవెవర్
ప్రధాని మోడీ నాయకత్వంపై బెల్జియం ప్రధాని బార్ట్ డె వెవర్ ప్రశంసలు కురిపించారు. మోడీ ప్రపంచంలోని స్ఫూర్తిదాయక నేతల్లో ఒకరని పేర్కొన్నారు. ఆయన అత్యంత తెలివైన నాయకుడని, కీలక నిర్ణయాలను తొందరపడి కాకుండా అన్ని అంశాలను ఆలోచించిన తర్వాత తీసుకుంటారని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు, అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలో మోడీ అనుసరిస్తున్న విధానం ప్రత్యేకంగా ఉందని బార్ట్ డె వెవర్ అభిప్రాయపడ్డారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇతర దేశాలతో సంబంధాలను కొనసాగిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు.
ప్రపంచ వేదికపై భారత్ క్రమంగా విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని బెల్జియం ప్రధాని పేర్కొన్నారు. భారత్తో బెల్జియం సంబంధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
భారత్-బెల్జియం మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికతతో పాటు అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.