www.ntodaynews.com
నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానానికి రూ.50,116 విరాళం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి విజయవాడ గుణదలకు చెందిన కలకోట హైమావతి జ్ఞాపకార్థం ఆమె కుమార్తె కల్పన కుమారి, అల్లుడు సీతారామిరెడ్డి ఆదివారం రూ.50,116 విరాళంగా అందజేశారు.
విరాళం అందించిన దాతలకు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకుడు టి. గోపాలాచార్యులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.