BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా:

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
11 Jun, 2026 - 02:52 PM
66 వీక్షణలు

ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: రూరల్ సీఐ సుబ్బా నాయుడు

NTODAY NEWS చిలకలూరిపేట:  పట్టణంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రూరల్ సీఐ సుబ్బా నాయుడు తెలిపారు. ప్రత్తిపాటి ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్గదర్శకత్వంలో ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం జరగనుంది.

పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో 16వ తేదీన (మంగళవారం) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుంది. ఈ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 2,500 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని సీఐ సుబ్బా నాయుడు పేర్కొన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగుల కోసం ఇలాంటి ఉపాధి కార్యక్రమాలు చేస్తున్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి,  ప్రత్తిపాటి శరత్ కు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు , అర్హులైన అభ్యర్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాటి ఫౌండేషన్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.