BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

బూరుగుగూడెం సచివాలయంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
158 వీక్షణలు

చాట్రాయి, జూలై 8: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ సచివాలయంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం అమలుపై మండల తహశీల్దార్ జి. శ్వేత ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ జి. శ్వేత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, దరఖాస్తుల పరిష్కారాన్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఆమె సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.