BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

బూరుగుగూడెం సచివాలయంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 12:43 PM
60 వీక్షణలు

చాట్రాయి, జూలై 8: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ సచివాలయంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం అమలుపై మండల తహశీల్దార్ జి. శ్వేత ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ జి. శ్వేత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, దరఖాస్తుల పరిష్కారాన్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఆమె సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.