రాజీవ్ భవన్లో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను బుధవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, రైతు సంక్షేమానికి, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు వైఎస్సార్ విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా ఆయన పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రకాశరావు, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు.