www.ntodaynews.com
పులివెందుల క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రాజశేఖర్ రాయల్
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
పులివెందుల | NTODAY NEWS
పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కడప జిల్లా ఒంటిమిట్ట మండల ప్రచార విభాగ అధ్యక్షుడు రాజశేఖర రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండలంలో నెలకొన్న పలు అంశాలు, పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులపై రాజశేఖర రాయల్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించారు.
మండలంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.