www.ntodaynews.com
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని అధికారికంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం.
అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై కేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు, సమావేశాలు ముగిసిన అనంతరం తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.