హనుమకొండలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నాయిని
కాళోజీ కళాక్షేత్రంలో వైభవంగా వేడుకలు.. నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే
హనుమకొండ | Ntoday News
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించేలా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణుడి జీవిత విశేషాలతో పాటు హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని రూపొందించిన కూడా మాజీ చైర్మన్, యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ను ఎమ్మెల్యే అభినందించారు.
సుందర్ రాజ్ యాదవ్ చిన్ననాటి నుంచే సేవా భావంతో ప్రజలకు సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ సమాజ సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు.
శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భవిష్యత్లోనూ ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించాలని కోరుతూ సుందర్ రాజ్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు.