www.ntodaynews.com
మేకలచెరువులో ఎమ్మార్వో, ఏవో తో కలసి యూరియా పంపిణీ చేసిన భాజపా జిల్లా నాయకులు
తెలంగాణ
మేకలచెరువు లో ఎమ్మార్వో,ఏవో తో కలసి యూరియా పంపిణీ చేసిన భాజపా జిల్లా నాయకులు: జయరాం
NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్
నంబుల పూలకుంట మండలం మేకల చెరువు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా ను స్థానిక మండల తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి తో పాటు ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా సమాచార చట్ట హక్కు జిల్లా కన్వీనర్ జయరాములు యూరియా పంపిణీ అనంతరం మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక శాసన సభ్యులు కంది కుంట వెంకట ప్రసాద్ గార్లు రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని,రైతులకు అవసరమైన యూరియా మరియు డీఏపీ ఎరువులను సకాలంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా పంపిణీ చేస్తున్నా రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఆందోళనలు చేపడుతోందనీ. గత వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ యూరియాను కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే నన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో యూరియా సరఫరా, పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, ఎక్కడా కొరత తలెత్తకుండా ప్రభుత్వం తగినన్ని జాగ్రతలు తీసుకుంది అన్నారు. ఎటువంటి అవకతవకలు లేకుండా రైతులకు నేరుగా యూరియా చేరేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో గత వైసిపి ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా అందించారన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube