BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

చాట్రాయిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 04:10 PM
28 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.చాట్రాయి మండల ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యంగా సమావేశమై ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పుష్పగుచ్ఛం సమర్పించి, పూలతో అభిషేకం చేశారు.తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, సీనియర్ ఫోటోగ్రాఫర్లను షీల్డులు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. యూనియన్ సభ్యులందరికీ జ్ఞాపికలను అందజేసి, అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు సవరం రామారావు అధ్యక్షత వహించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లు సోమిశెట్టి శ్రీనివాసరావు, పడగ షణ్ముఖ, ఉపాధ్యక్షుడు గమిడిమెల్లి ప్రభాకర్, కోశాధికారి లింగోజు మురళి, కార్యదర్శి రెబ్బు సుమన్, సంయుక్త కార్యదర్శి ఇజ్జిగిరి కేశవ తదితరులు పాల్గొన్నారు.ఫోటోగ్రఫీ రంగానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని చాట్రాయిలో ఘనంగా నిర్వహించడం పట్ల ఫోటోగ్రాఫర్లు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు సవరం రామారావు, సంయుక్త కార్యదర్శి ఇజ్జిగిరి కేశవ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, జీవితంలోని మధుర జ్ఞాపకాలను భద్రపరిచే గొప్ప కళ అని అన్నారు. సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటనను ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ రంగానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.