BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చీమలపాడు జంక్షన్‌లో ఎన్‌హెచ్-30పై భారీ గుంతకు తక్షణ మరమ్మతులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 05:13 AM
25 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని చీమలపాడు జంక్షన్ వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్-30పై ఏర్పడిన భారీ గుంత కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చొరవతో మరమ్మతు పనులు చేపట్టారు.

రహదారి దుస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. దీంతో అధికారులు స్పందించి చీమలపాడు జంక్షన్ వద్ద ఏర్పడిన భారీ గుంతకు అత్యవసరంగా మరమ్మతు పనులు ప్రారంభించారు.

మరమ్మతు పనులను స్థానికంగా పర్యవేక్షిస్తూ, నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తక్షణ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.