చీమలపాడు జంక్షన్లో ఎన్హెచ్-30పై భారీ గుంతకు తక్షణ మరమ్మతులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని చీమలపాడు జంక్షన్ వద్ద జాతీయ రహదారి ఎన్హెచ్-30పై ఏర్పడిన భారీ గుంత కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చొరవతో మరమ్మతు పనులు చేపట్టారు.
రహదారి దుస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. దీంతో అధికారులు స్పందించి చీమలపాడు జంక్షన్ వద్ద ఏర్పడిన భారీ గుంతకు అత్యవసరంగా మరమ్మతు పనులు ప్రారంభించారు.
మరమ్మతు పనులను స్థానికంగా పర్యవేక్షిస్తూ, నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తక్షణ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్హెచ్ఏఐ అధికారులు, సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.