BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

చెకుముకి పోటీలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 07:16 PM
36 వీక్షణలు

చెకుముకి పోటీలను జయప్రదం చేయండి

  • విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు వేదికగా చెకుముకి పోటీలు

తిరువూరు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి పోటీలు విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకత, పోటీ తత్వాన్ని అభివృద్ధి చేస్తాయని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ తెలిపారు.

స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జెవివి నాయకులతో కలిసి చెకుముకి గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయి చెకుముకి పోటీలు ఈనెల 27న నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని వెల్లడించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు కలిపి ఒకే ప్రశ్న పత్రంతో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

పాఠశాల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు సెప్టెంబర్ 11న నిర్వహించే మండల స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. మండల స్థాయి పోటీ పరీక్షలు ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు.

చెకుముకి పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని జెవివి నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. హరికృష్ణ, నాయకులు రాం ప్రదీప్, సుధాకర్, శీనయ్య, సైదులు, శోభన్ బాబు, భరత కుమారి, విజయ్ కుమార్, సురేంద్ర నాధ్ తదితరులు పాల్గొన్నారు.