www.ntodaynews.com
చింతలపూడిలో ప్రజాదర్బార్.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హామీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చింతలపూడి శాసనసభ్యుల కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతున్నట్లు పేర్కొన్నారు.