చిన్నంపేట మెయిన్ స్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
చిన్నంపేట మెయిన్ స్కూల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట మెయిన్ స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.కె. మబ్బు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూజివీడు ఏఎంసీ డైరెక్టర్ అత్తులూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతం లభించిందని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, విద్యతో పాటు మంచి విలువలను అలవరచుకోవాలని తెలిపారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.