చనుబండలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
చనుబండలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ మెయిన్ మరియు కురుమ బజార్ స్కూల్స్ లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతం లభించిందని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నక్కా రాము,చీదిరాల మారేశ్వర రావు, కందుల కృష్ణ, నెక్కళ్ళపు వెంకటేశ్వరరావు, పుల్లయ్య మాష్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.