BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ......
Date of Publish : 19 July 2026, 05:22 pm
Posted by : కూనురు మధు

డెడ్ స్టోరేజీకి చేరువలో నాగార్జునసాగర్ : ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

తెలంగాణ
/ నల్గొండ
19 Jul, 2026 - 05:22 PM
167 వీక్షణలు

డెడ్ స్టోరేజీకి చేరువలో నాగార్జునసాగర్ : ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

నాగార్జునసాగర్ జలాశయం పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడం, ఎండల తీవ్రతకు తోడు అవసరాల నిమిత్తం నీటిని వాడటంతో సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోయి, ప్రస్తుతం డెడ్ స్టోరేజీ స్థాయికి చేరువయ్యాయి. జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 6.2 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఎల్‌ఎన్‌ఎస్‌పీ (లెఫ్ట్ బ్యాంక్ కెనాల్), ఆర్‌బీసీ (రైట్ బ్యాంక్ కెనాల్) కాలువలకు నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సాగర్ నీటిపైనే ఆధారపడి సాగు చేసే నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల రైతుల్లో ఈ పరిస్థితి తీవ్ర గుబులు రేపుతోంది. సాధారణంగా ఈ పాటికే ఖరీఫ్ (వానాకాలం) సాగు పనులు వేగవంతం కావాల్సి ఉండగా, నీటి లభ్యత లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాబోయే రోజుల్లో తగినంతగా వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సాగుపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటుతుండటంతో ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తాగునీటి ఎద్దడి రాకుండా చూడటంతో పాటు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలపైనే ఆశలు

​ప్రస్తుత పరిస్థితుల్లో ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం ప్రాజెక్టుల ద్వారా నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తేనే సాగర్‌కు మళ్లీ ఊపిరి పోసే అవకాశం ఉంది. లేదంటే ఈ ఏడాది సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి