ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు
రాకపోకలకు అంతరాయం.. బ్రిడ్జికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని భక్తుల విజ్ఞప్తి
నంద్యాల, సెప్టెంబర్ 20 | N Today News: నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే మార్గంలో చామకాలువ వద్ద ఉన్న బ్రిడ్జి ఒకవైపు దెబ్బతిని కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు.
బ్రిడ్జి కొంత భాగం కిందకు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
ప్రతిరోజూ భక్తులు, వాహనదారులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో దెబ్బతిన్న బ్రిడ్జి కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
దెబ్బతిన్న బ్రిడ్జిని సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన మరమ్మతులు త్వరగా చేపట్టడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.