MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు
ఆరోగ్యశ్రీ వార్డులో ఘటన.. రోగులు, బంధువుల్లో ఆందోళన
వరంగల్: వరంగల్లోని MGM ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు భాగం ఊడిపడటంతో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. పెరాలసిస్తో చికిత్స పొందుతున్న మస్తాన్తో పాటు అటెండర్లు ఎల్లమ్మ, ఓంకార్ గాయపడినట్లు తెలుస్తోంది.
గాయపడిన వారు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. ఘటన అనంతరం గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రిలో పైకప్పు ఊడిపడటంతో రోగులు, వారి బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
పాత భవనాలు, పైకప్పుల పరిస్థితిని అధికారులు పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.