చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
చౌడేపల్లి, సెప్టెంబర్ 19, Ntoday న్యూస్: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పలమనేరు రహదారిలోని చిట్టిరెడ్డిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో చౌడేపల్లి కుమ్మరి వీధికి చెందిన వెంకటరమణ కుమారుడు మహేష్, గంగాభవాని కురపల్లికి చెందిన డి. సంతోష్ ఉన్నట్లు సమాచారం. అయితే మృతుల వివరాలను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.