సీనియర్ సీపీఐ నాయకుడు బృంగి సుబ్రహ్మణ్యం మృతి
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి: సీనియర్ సీపీఐ నాయకుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బృంగి సుబ్రహ్మణ్యం ఆదివారం సేలంలో మృతి చెందారు. ఆయన మృతితో సీపీఐ నాయకులు, ఉపాధ్యాయులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బృంగి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం సేలం నుంచి కనిగిరిలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.
అనంతరం సోమవారం పీసీ పల్లి మండలం బుడ్డారెడ్డిపల్లిలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సీపీఐలో సీనియర్ నాయకుడిగా, ఉపాధ్యాయుడిగా బృంగి సుబ్రహ్మణ్యం అందించిన సేవలను పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, అభిమానులకు తీరని లోటుగా పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సీపీఐ నాయకులు, ఉపాధ్యాయులు, అభిమానులు సానుభూతి తెలిపారు.