అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి
కుటుంబ విషయాలపై వాగ్వాదం.. కత్తితో దాడి జరిగినట్లు స్థానికుల సమాచారం
వరంగల్: వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని గరీబ్నగర్లో శనివారం రాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. కుటుంబ విషయాలపై అన్న ప్రవీణ్, తమ్ముడు ప్రసాద్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రవీణ్ కత్తితో ప్రసాద్పై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
దాడిలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్లోని MGM ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు దారితీసిన కారణాలు, దాడి జరిగిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.