నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ
మృతదేహానికి నివాళులర్పించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంటకు చెందిన మిద్దె నాగార్జున హత్య ఘటనపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. నాగార్జున మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
నాగార్జున స్వగ్రామం భీమవరానికి వెళ్లిన భూమా అఖిలప్రియ.. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. నాగార్జున హత్య అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడినట్లు తేలిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపారు.
నాగార్జున కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు అండగా ఉంటామని, ఆయన పిల్లల భవిష్యత్తు, చదువుల విషయంలో బాధ్యత తీసుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
కాగా, నాగార్జున హత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు, నిందితుల పాత్రపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.