ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు
నైరుతి బంగాళాఖాతం వరకు తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉండగా, ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ముఖ్యంగా నేడు, రేపు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండడంతో పాటు, విద్యుత్ స్తంభాలు, చెట్లు మరియు నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.