BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 September 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి విద్యుత్ సబ్‌డివిజన్‌లో అక్రమాల కలకలం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Sep, 2026 - 06:08 AM
2 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

భారీగా బయటపడుతున్న అవినీతి.. తవ్వేకొద్దీ అక్రమాలు చింతలపూడి విద్యుత్ సబ్‌డివిజన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవహారంపై విచారణ ఏలూరు జిల్లా చింతలపూడి విద్యుత్ సబ్‌డివిజన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, మార్పిడి వ్యవహారంపై జరుగుతున్న విచారణలో పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. చింతలపూడి మండలం ఎండపల్లిలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ల అక్రమాలపై విశాఖపట్నం సీఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎండపల్లి ప్రాంతానికి వెళ్లిన అధికారులకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ సమస్యలను వివరించినట్లు సమాచారం. తమకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు తమ అనుమతి లేకుండా, ఇష్టానుసారంగా మార్చివేశారని పలువురు రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, కేటాయింపు, మార్పిడి ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రైతులు విచారణ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తమకు జరిగిన అన్యాయంపై గతంలో స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించినప్పటికీ తగిన స్పందన లభించలేదని కొందరు రైతులు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల స్థాయిలో విచారణ జరగడంతో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలకు చింతలపూడి విద్యుత్ శాఖలోని కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. విచారణలో బయటపడే అంశాలు, బాధ్యులపై తీసుకునే చర్యలపై రైతులు, స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.