www.ntodaynews.com
కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిర ఏర్పాట్ల పరిశీలన
ఆంధ్రప్రదేశ్
కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిర ఏర్పాట్ల పరిశీలన
కుప్పం: ఈ నెల 28వ తేదీన కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్న పింక్ బస్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఏర్పాట్లను సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పరిశీలించారు. శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, వైద్య సేవలు, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.