ఖమ్మం రేంజ్లో ఏసీబీ ట్రాప్.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మరో వ్యక్తి పట్టుబాటు
తెలంగాణ
/
ఖమ్మం
ఖమ్మం: అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్లో అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటు మరో వ్యక్తి పట్టుబడ్డారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలంలోని కాచనపల్లి బీట్, రామానుజగూడెం బీట్ల ఇన్చార్జిగా పనిచేస్తున్న బానోత్ రవికుమార్ (ఏ-1), పటాన్ సాదిక్ ఖాన్ (ఏ-2)లను ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు ట్రాప్ కేసులో పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.