ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా.. సేవా కార్యక్రమాలతో ప్రత్యేక ఆకర్షణ
తిరువూరు, ఆగస్టు 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంపీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థనలు చేశారు.
అనంతరం తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి మానవతా సేవను చాటుకున్నారు. అలాగే పట్టణంలోని అన్న క్యాంటీన్లో ప్రజలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ కేశినేని శివనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.