www.ntodaynews.com
ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్
జాతీయం
ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్.. నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు నిలిపివేత
ఎయిర్టెల్ వినియోగదారులకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. సంస్థ నాలుగు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేసింది. ₹299, ₹579, ₹619, ₹649 విలువైన ప్లాన్లు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి.
ముఖ్యంగా ₹299 ప్లాన్ స్థానంలో ₹349 ప్లాన్ను అందుబాటులోకి తీసుకురావడంతో తక్కువ ధరలో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సేవలను వినియోగించే వారికి కనీస రీఛార్జ్ వ్యయం పెరిగినట్లయింది.
ఇప్పటికే ఉన్న ప్లాన్లలో మార్పులు చోటుచేసుకోవడంతో తమ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు కొత్త ధరలు, ప్రయోజనాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.