BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 25 March 2026, 04:56 pm
Posted by : కూనురు మధు

గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా బకాయిలు చెల్లించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
25 Mar, 2026 - 04:56 PM
219 వీక్షణలు

గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా బకాయిలు చెల్లించాలి 

జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా

​నల్గొండ జిల్లా కల్లు గీత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు గీతా పనివారాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా పనివారాల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన లేదా వికలాంగులైన గీత కార్మిక కుటుంబాలకు రావాల్సిన 13 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి డి అని డిమాండ్ చేశారు. గీతావృత్తిదారులు మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను 10 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 రూపాయల లక్షలకు పెంచాలి అని పేర్కొన్నారు, మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పర్యవేక్షణలో వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్ ఇచ్చే పాత పద్ధతిని పునరుద్ధరించాలి అని  ,​ గీతా కార్మికులందరికీ కాటమయ్య, సేఫ్టీ కిట్లు అందించి వృత్తి పెన్షన్‌ను పెంచి స్త్రీ, పురుషులకు సమానంగా వర్తింపజేయాలి తెలిపారు. సహకార సంఘాలకు తాటివనం, ఈత వనం పెంచడం కోసం భూములు కేటాయించాలని, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సూర్యాపేట జిల్లాకు స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ పేరు పెట్టాలని. ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పబ్బు వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగె సైదులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.