www.ntodaynews.com
గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం చేయాలి: జగన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల సహాయక వ్యవస్థలను వినియోగించి మత్స్యకారులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని జగన్ పేర్కొన్నారు. గల్లంతైన వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తూ, మత్స్యకారుల కోసం నిరంతర గాలింపు కొనసాగించాలని కోరారు.