గోమాత ప్రచారకుడు కాశీనాథ్కు ఘన సన్మానం
పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గోమాత ప్రచారకుడు కాశీనాథ్ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కాశీనాథ్కు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో టిడిపి గ్రామ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు మాట్లాడుతూ హిందూ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. గోరక్షణ కోసం కృషి చేసే వారిని, గోమాత గొప్పతనాన్ని ప్రజలకు వివరించే వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ గోవు నుంచి లభించే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, గోమూత్రం, గోమయం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి కమిటీ గౌరవ అధ్యక్షుడు యనమద్ది విజయకుమార్, మహిళా కమిటీ సభ్యురాలు పొనుగుపాటి రాధమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.