www.ntodaynews.com
హాస్టల్లోకి వెళ్లి ఫోటోలు ఎలా తీశారు.. వారిపై చర్యలు తీసుకోండి
తెలంగాణ
చెన్నూరు ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు కారంతో అన్నం వడ్డించిన ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులతో మాట్లాడిన మంత్రి, హాస్టల్లోకి వెళ్లి ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐకి సూచించారు.
బీఆర్ఎస్ నేతలు అనుమతి లేకుండా హాస్టల్లోకి ప్రవేశించి ఫోటోలు తీశారని మంత్రి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అయితే, విద్యార్థులకు కారంతో అన్నం వడ్డించిన ఘటనపై సిబ్బందిపై చర్యలు తీసుకోవడం కంటే, సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపైనే చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పడం వివాదానికి దారితీసింది.