హైదరాబాద్ చందానగర్లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్సై బాలరాజు అరెస్ట్
హైదరాబాద్ చందానగర్లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్సై బాలరాజు అరెస్ట్
చందానగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ చందానగర్ ఎస్సై బాలరాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఓ భూ వివాదానికి సంబంధించి కేసు నమోదు చేసి, తదుపరి విచారణ పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సై బాలరాజును అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సై బాలరాజుతో పాటు కానిస్టేబుల్ రాజ్కుమార్, స్టేషన్ రైటర్ రాఘవను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే వారిని అధికారులు విచారిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.