BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:11 AM
29 వీక్షణలు

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

ల్యాండ్‌ వ్యవహారంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు

హైదరాబాద్‌, లంచం తీసుకుంటూ పోలీస్ అధికారులు ఏసీబీకి చిక్కిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్ ఓ ల్యాండ్‌ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఫిర్యాదుదారుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఎస్‌ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. లంచం డిమాండ్ చేసిన పరిస్థితులు, ల్యాండ్‌ కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.