www.ntodaynews.com
హైదరాబాద్ చంపాపేట్లో దుర్గమ్మ విగ్రహం మాయం.. కలకలం
తెలంగాణ
హైదరాబాద్ చంపాపేట్లో దుర్గమ్మ విగ్రహం మాయం.. కలకలం
హైదరాబాద్: చంపాపేట్ కటికొనుకుంట ప్రాంతంలో దుర్గమ్మ అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అమ్మవారి విగ్రహం మాయమైన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
విగ్రహం ఎలా మాయమైంది? గుర్తు తెలియని వ్యక్తుల ప్రమేయం ఉందా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.