హెచ్చరిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండిపోనున్న ఎండలు - ఆరెంజ్ అలర్ట్ జారీ
హెచ్చరిక: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండిపోనున్న ఎండలు - ఆరెంజ్ అలర్ట్ జారీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాబోయే ఏడు రోజుల పాటు ఎండల తీవ్రత విపరీతంగా ఉండనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (IMD) జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ మరియు మంచిర్యాల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలకు సూచనలు:
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో ప్రయాణాలు మానుకోవాలి.
వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత మంచినీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ వంటి రక్షణ కవచాలను ఉపయోగించాలని సూచించారు.