హనుమకొండ జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
పరకాల అమరధామంలో అమరులకు నివాళులర్పించేందుకు రాక.. ఖాజీపేటలో ఘన స్వాగతం
హనుమకొండ | Ntoday News
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా పేర్కొనే పరకాల అమరధామం వద్ద అమరులకు నివాళులర్పించేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హనుమకొండ జిల్లాకు విచ్చేశారు.
ఈ సందర్భంగా ఖాజీపేట బాపూజీ నగర్ జంక్షన్ వద్ద హనుమకొండ జిల్లా బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం తెలిపారు.
పరకాల అమరధామంలో అమరులకు నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకోవడం ద్వారా తెలంగాణ విమోచన దినోత్సవ స్ఫూర్తిని చాటాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.