చిట్యాలలో నూతన పాలశీతలీకరణ కేంద్రం ప్రారంభం సెప్టెంబర్ 3న ప్రారంభించనున్న పాలశీతలీకరణ కేంద్రం
చిట్యాల | Ntoday News
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో నూతన పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 3, 2026 గురువారం ఉదయం 11 గంటలకు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులోని భువనగిరి రోడ్డు (వెజిటబుల్ మార్కెట్) వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
నూతన పాలశీతలీకరణ కేంద్రం అందుబాటులోకి రావడం ద్వారా మండలంలోని పాల ఉత్పత్తి చేసే రైతులకు ప్రయోజనం కలగనుందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.