YSR వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఆంధ్రప్రదేశ్
/
తూర్పు గోదావరి
YSR వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కొరుకొండ మండలం దోసకాయలపల్లి:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా దోసకాయలపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో కర్రి నాగేశ్వరరావు, కడవల శివకుమార్, గొల్లవిల్లి మురళి, బేదంపూడి కన్నయ్య, సన్నపు శివ, బచ్చల ప్రసాద్, దొండపాటి గోపి, కొల్లపు సంతోష్ కుమార్, బుంగా విజయ్, మార్ని సత్తిబాబు, నెక్కంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.