పుంగనూరులో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో యువత జోష్
500 మందితో భారీ బైక్ ర్యాలీ.. ‘జై కొట్టు’ జనసేన యువజన విభాగం లోగో ఆవిష్కరణ
పుంగనూరు | Ntoday News
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పుంగనూరులో జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
జనసేన పార్టీ కార్యాలయం నుంచి ట్రావెలర్స్ బంగ్లా వరకు సుమారు 500 మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోకుల్ సర్కిల్లో కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగానికి సంబంధించిన ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. యువతకు పవన్ కల్యాణ్ సందేశాన్ని అందిస్తూ, యువత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సహకరించిన పుంగనూరు పోలీసు అధికారులకు జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.